కర్బూజా రసగుల్ల



కర్బూజా రసగుల్ల


కావలసినవి:


కర్బూజా పండు - అరకేజి
పాలు - ఒక లీటర్‌
నెయ్యి -100 గ్రా
పంచదార - 2 కప్పులు
కార్న్‌ ఫోర్‌- 3 స్పూన్లు
నిమ్మకాయ -1






తయారు చేసే విధానం: 


ముందుగా చక్కెరతో తీగ పాకం పట్టాలి తరువాత కర్బూజాని ముక్కలుగా చేసి మిక్సిలో వేసి జ్యూస్‌ చేసుకొని పాకము చల్లారాక జ్యూస్‌ ను అందులో కలపాలి. తరువాత పాలను మరిగించి అందులో నిమ్మకాయ పిండి పాలు విరిగేలా చెయ్యాలి.తరువాత అందులో నీరంతా పోయేలా పల్చటి గుడ్డలో వేసి వడకట్టి పన్నీర్‌ తయారు చేసుకోవాలి.ఇప్పుడు విరిగిన పాల మిశ్రమంలో కార్న్‌ ఫోర్‌ వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి పోసి కాగాక ఉండలను వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు వేయించి ముందుగా తయారుచేసుకున్న కర్బూజా జ్యూస్‌లో వేసి నానవ్వాలి.లేదా ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా కూడా సర్వ్‌ చేసుకోవచ్చు...