పాల పూరీలు




పాల పూరీలు


కావలసిన పదార్థాలు :
మైదా - 200గ్రా
గోధుమపిండి - 200గ్రా
పాలు - అర లీటరు
ఉప్పు - అరచెంచా
గసగసాలు - 25గ్రా
నూనె- సరిపడా
పంచదార - 200గ్రా
కొబ్బరి పాలు - అర లీటరు
యాలకుల పొడి - కొద్దిగా



తయారీ విధానం :

ముందుగా పాలు బాగా కాచి అందులో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి వేసి బాగా కలిపి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకోవాలి.మెదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన వేసి కలిపి పదిహేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి. పిండితో పూరీలు చేసి పెట్టుకుని ఆయిల్‌ మరిగించి పూరీలు బ్రౌన్‌గా వేయించి తయారు చేసుకున్న పాల మిశ్రమంలో వేసుకుని అవి నానాక సర్వ్‌ చేసుకోవాలి.