This is default featured slide 1 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
పాల పూరీలు
కోవా కజ్జికాయ
కోవా కజ్జికాయ
కావలసిన పదార్థాలు
మైదాపిండి అరకిలో, పంచదార కిలో, పాలకోవా - పావుకిలో, జాపత్రి - 2 గ్రాములు,
యాలకులు 2 గ్రాములు, శనగపిండి 50 గ్రాములు, వంట సోడా - పావు స్పూను, బేకింగ్ పౌడర్ పావుస్పూను, నెయ్యి 100 గ్రాములు, రిఫైన్డ్ ఆయిల్ - తగినంత
తయారు చేసే పద్ధతి:
ఇండియన్ స్వీట్లలో కజ్జికాయ విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు. కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి.
బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి.అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం!
మలాయ్ గులాబ్ జూమూన్
కర్బూజా రసగుల్ల
కర్బూజా రసగుల్ల
కావలసినవి:
కర్బూజా పండు - అరకేజి
పాలు - ఒక లీటర్
నెయ్యి -100 గ్రా
పంచదార - 2 కప్పులు
కార్న్ ఫోర్- 3 స్పూన్లు
నిమ్మకాయ -1
తయారు చేసే విధానం:
ముందుగా చక్కెరతో తీగ పాకం పట్టాలి తరువాత కర్బూజాని ముక్కలుగా చేసి మిక్సిలో వేసి జ్యూస్ చేసుకొని పాకము చల్లారాక జ్యూస్ ను అందులో కలపాలి. తరువాత పాలను మరిగించి అందులో నిమ్మకాయ పిండి పాలు విరిగేలా చెయ్యాలి.తరువాత అందులో నీరంతా పోయేలా పల్చటి గుడ్డలో వేసి వడకట్టి పన్నీర్ తయారు చేసుకోవాలి.ఇప్పుడు విరిగిన పాల మిశ్రమంలో కార్న్ ఫోర్ వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి పోసి కాగాక ఉండలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ముందుగా తయారుచేసుకున్న కర్బూజా జ్యూస్లో వేసి నానవ్వాలి.లేదా ఫ్రిజ్లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు...
బాదుషా
చూర్మా లడ్డు
చూర్మా లడ్డు
కావలసినవి:
కోవా - 100 గ్రాములు,గోధుమ పిండి - 200 గ్రాములు,బాదాం పప్పు - 50 గ్రాములు,యాలకులు - 4, నెయ్యి - 400 గ్రాములు,పంచదార పొడి - 200 గ్రాములు
తయారీ విధానం : గోధుమ పిండి తీసుకుని కరిగించిన నెయ్యి కొద్దిగా నీళ్లు చపాతీ పిండిలా కలుపుకుని ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి తడిపిన ఈ ఉండలను వేసి బ్రౌన్ కలర్ వరకు వేయించుకుని చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఒక గిన్నెలోకి తీసుకుని కోవా వేసి కలపాలి. తరువాత పంచదార, బాదాం యా లకులు కలిపి పొడి పెట్టుకోవాలి. పాన్లో కొద్దిగా నెయ్యి వేసి గోధుమపిండి, కోవా మి శ్రమం వేసి కొంచంసేపు వేయించి, చల్లారాక. బాదాం మిస్రమాన్నీ వేసి కలిపి లడ్డులు చేసుకోవాలి.
రాజ్భోగ్ స్వీట్
కావల్సిన పదార్థాలు:
విరిగిన పాలు - 250 గ్రా. (ఆవు పాల నుంచి చేసినది),పచ్చికోవా - 3 టేబుల్ స్పూన్లు,పిస్తాపప్పులు - 15
మైదా - టీ స్పూను, పంచదార - 5 కప్పులు
కుంకుమపువ్వు - అర టీ స్పూను
రోజ్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి - అర టీ స్పూను
1. ముందుగా విరిగిన పాలను మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
2. తర్వాత వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి.
4. తర్వాత పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో పిస్తా, బాదం మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన ఉంచాలి.
5. ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి
6. తయారుచేసి ఉంచుకున్న స్టఫ్డ్ బాల్స్ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి.
7. అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదుని ముషాలు ఉంచితే, బాల్స్ రెట్టింపు సైజుకి పొం గుతాయి. అంతే రాజ్ భోగ్ స్వీట్ రిసిపి రెడీ.
ఆహారం తాజాగా ఉండాలంటే...?
మునగాకు పప్పు కూర
మునగాకు పప్పు కూర
గుత్తి వంకాయ కూర
గుత్తి వంకాయ కూర
కావల్సినవి:
వంకాయలు చిన్నవి - అర కిలో
శనగ పప్పు - ఒక కప్
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి తురిమినది - అర కప్
ఎండు మిర్చి - తగినంత
ఆవాలు, జీలకర్ర పోపుకు సరిపోయే అన్ని
పసుపు
ఉప్పు తగినంత
నూనె _ అర కప్పు
ముందుగా శనగ పప్పు, ధనియాలు, మిరపకాయలు (నూనె లేకుండా) వేయించి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వంకాయలు కడిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగ సిద్ధం చేసుకున్న పొడిని, కొబ్బరి తురుమును కలిపి వంకాయలలో కూర్చాలి.
తరువాత బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, వేసుకొని కొంచం వేగిన తర్వాత కూర్చిన వంకాయలు కూడా వేసి మూత పెట్టాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ.
జిలేబి
జిలేబి
బియ్యప్పిండి - 3 స్పూన్స్
చెక్కర (బెల్లం కోరుకొన్నది) - 21/2 కప్
సోడ - చిటికెడు
కేసర్ రంగు---చిటికెడు
పుల్ల మజ్జిగ--1 కప్
నెయ్యి---2 కప్స్(వేయించడానికి)
ఒక గిన్నెలోమైదా, బియ్యప్పిండి, సోడ,
పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉంటలు లేకుండా జారుగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి.(పక్కరోజు జిలేబి చేయాలంటే ముందు రోజే పిండి తయారు చేసుకోవాలి)
తరువాత నానిన పిండి లో, కేసర్ కలర్ వేసి బాగా కలపాలి. మైదా పిండి బాగా నాని, తీగ లా జారుగా తయారవుతుంది. తరువాత తయారు చేసుకున్న పిండిని కవ్వం తో చిలకాలి. అప్పుడు పిండీ నురగలుగా వస్తుంది.
తరువాత ఒక గిన్నెలో చెక్కర (బెల్లం) వేసి, చెక్కర మునిగేలా నీరు వేసి, తీగ పాకం చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
తరువాత వెడల్పాటి బానలి లో నెయ్యి వేసి, వేడి చేయాలి. తరువాత సాస్ బాటిల్లో తయారు చేసిన మైదా పిండిని వేయాలి.తరువాత నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబి వేసుకోవాలి.
ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి.
ఇలా కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకం లో వేసి అర నిముషం పాటు ఉంచాలి.
తరువాత తీసి,ప్లేట్ లో తీసుకొని కాసేపు అయ్యాక తింటే పాకం అంతా జిలేబికు పట్టి, ఎంతో రుచిగా ఉంటుంది.
రవ్వ ఇడ్లి
రవ్వ ఇడ్లి
కావాల్సినవి :
ఉప్మా రవ్వ - 1 కప్పు
పుల్ల పెరుగు - 1 కప్పు
ఉప్పు : తగినంత
నీళ్ళు : తగినంత
కొబ్బరి కోరు - రెండు స్పూన్లు
కారట్ - 1 స్పూన్
ఉల్లిపాయలు - 1 /2 కప్పు సన్నగా తరిగినవి
అల్లం - 1 స్పూన్ సన్నగా తరిగినవి
ఆవాలు, పచ్చి శెనగపప్పు : ఒక అర స్పూన్
నూనె : నాలుగు స్పూన్లు
తయారు చేసే విధానము :
ముందుగా బాండలిలో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి.వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి వేయించాలి.వేగిన ఉప్మా రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పుల్ల పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి.మామూలుగా తయారు చేసే ఇడ్లి పిండి లాగ తయారు చేసుకోవాలి.అందులో కారట్ తురుము, ఉల్లిపాయలు,కొబ్బరి కోరు, అల్లం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అర గంట పాటు నాన పెట్టాలి.
ఇడ్లి పాత్రకి నూనె రాసి, వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ. దీనిని వేరుశెనగ పచ్చడి / టమాటా పచ్చడితో కాని తింటే బావుంటుంది.
ఎగ్ కర్రీ
గ్రుడ్లు - 3
ఉల్లిపాయలు - 1 తరిగినది
టమోటాలు - 1 తరిగినది
కారం
పసుపు - 1 teaspoon
మిరియాల పొడి
ఉప్పు
ఒక పాన్ తీసుకొని తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి
కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి
వేగాక టమోటా ముక్కలను, పసుపు, ఉప్పు, కరం వేసి బాగా కలిపి 5 నిముషాల
పాటు fry చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్రుడ్డు తీసుకొని పగలకొట్టి గ్రుడ్డు మొత్తం
ఒకే చోటు పడేటట్టు వేసుకోవాలి . అలాగే మిగిలిన గ్రుడ్లను కూడా పాన్ అన్ని
వైపులా వేసుకోవాలి కొంచం ఉప్పు, మిరియాల పొడి గ్రుడ్డు పైన చల్లి మూత పెట్టి
ఉడక పెట్టుకోవాలి ఒక వైపు ఉడికాక గ్రుడ్లను ఇంకో వైపు తిప్పి ఉడికించాలి
అంతే అన్నం తో వేడి వేడి గ తింటే ఎంతో రుచి గా ఉంటుంది ఎగ్ కర్రీ